తన ఇంటికి తానే నిప్పంటించుకున్నాడు.!  | Sakshi
Sakshi News home page

తన ఇంటికి తానే నిప్పంటించుకున్నాడు.! 

Published Fri, Oct 6 2017 2:29 PM

a man set  his house on fire - Sakshi

టోక్యో : జపాన్‌లో ఓ వ్యక్తి తన ఇంటికి తానే నిప్పంటించుకున్న ఆశ్చర్యకరమైన ఘటన వెలుగుచూసింది. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఇందులో ఆరుగురు అగ్నికి ఆహుతయ్యారు. వివరాల్లోకి వెళితే.. జపాన్‌లోని హిటాచిలో ఉన్న ఓ మూడు అంతస్తుల భవనంలో శుక్రవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఈ మంటలు దాదాపు గంటపాటు కొనసాగాయి.

ఈ ప్రమాదానికి తానే కారణమని ఓ 32 ఏళ్ల వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు. తన ఇంటికి తానే కావాలనే నిప్పు పెట్టినట్లు ఆయన చెప్పారని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో ఇంట్లో ఆయన భార్యతోపాటు ఐదుగురు పిల్లలు ఉన్నట్లు చెప్పారు. ఆయన గాయాలతో బయటపడగా.. భార్య, మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసున్న నలుగురు బాలురు, 11 ఏళ్ల బాలిక మంటల్లో కాలిపోయి మృతిచెందారు. భవనం మొదటి అంతస్తులోని ఓ గదిలో ఉన్న మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement